రోడ్లపై చెత్త పడకుండా సరికొత్త టెక్నాలజీతో ఉన్న వాహనాలను తీసుకున్నాం: కేటీఆర్
- హైదరాబాదును స్వచ్ఛంగా ఉంచేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం
- చెత్త సేకరణ కోసం 4,500 స్వచ్ఛ ఆటోలను వాడుతున్నాం
- చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభించబోతున్నాం
వాహనాల నుంచి చెత్త రోడ్లపైకి పడకుండా సరికొత్త టెక్నాలజీతో రూపొందిన వాహనాలను ఈ కార్యక్రమం కోసం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా ప్రారంభించబోతున్నామని చెప్పారు. చెరువుల్లో పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించడానికి 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ లను ప్రారంభించామని తెలిపారు. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ ఎస్సీటీపీ వాహనాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.