కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్ఐసీలోకి ఎఫ్డీఐలకు ఓకే
- ఇప్పటికే కొంతమేర పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్ధం
- తాజాగా ఎల్ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకూ అవకాశం
- ఎల్ఐసీలో 20 శాతం మేర ఎఫ్డీఐలకు గ్రీన్ సిగ్నల్
ఎల్ఐసీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరుస్తూ నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. 20 శాతం మేర వాటాలను ఎఫ్డీఐలకు కేటాయించవచ్చంటూ తాజాగా కేంద్రం ఆమోదం తెలిపినట్టు సమాచారం. భారత బీమా రంగం నిబంధనల మేరకు ఏదేనీ సంస్థలో 74 శాతం మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. అయితే ఈ నిబంధన ఎల్ఐసీకి వర్తించదు. తాజాగా ఎల్ఐసీలో కొంత మేర పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తే తప్పేముందన్నభావనతోనే కేంద్రం ఎల్ఐసీలోకి ఎఫ్డీఐలకు అనుమతి ఇచ్చిందేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.