అగ్రిగోల్డ్ కేసు విచారణ ఏలూరు కోర్టుకు బదిలీ
- హైకోర్టే చేపట్టాలని బాధితుల పిటిషన్
- కుదరదన్న హైకోర్టు.. పిటిషన్ తిరస్కరణ
- ఆస్తుల వేలం ద్వారా జమ అయిన రూ.50 కోట్లూ ఏలూరు కోర్టుకు బదిలీ
అంతేకాకుండా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఇప్పటిదాకా జమ అయిన రూ.50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టే ఈ కేసు విచారించాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసు విచారణను హైకోర్టు చేపట్టజాలదని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాము చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏలూరు జిల్లా కోర్టుకు హైకోర్టు సూచించింది.