కట్టు తప్పితే వేటు తప్పదు: బండి సంజయ్ హెచ్చరిక
- రెండో దఫా అసమ్మతి నేతల భేటీ
- భేటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్
- అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్య
- ప్రతి పార్టీలో అసమ్మతి నేతలుంటారంటూ తీసిపారేసిన సంజయ్
బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పిన సంజయ్.. అలాంటి పార్టీలో ఉంటూ కట్టు తప్పి ప్రవర్తించే నేతలపై వేటు వేయడం ఖాయమని హెచ్చరించారు. ప్రతి పార్టీలో అసమ్మతి నేతలంటూ కొందరు ఉంటారని చెప్పిన ఆయన.. వారి గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు.
అంతేకాకుండా అలాంటి వారి వల్ల పార్టీలకు ప్రయోజనం ఏమీ ఉండదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసమ్మతి నేతలు వారు పనిచేయకపోవడమే కాకుండా పనిచేసే వారిని పనిచేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా పార్టీ అడుగులు వేస్తోందని, ఇలాంటి సమయంలో అసమ్మతి అంటూ భేటీలు నిర్వహిస్తే సహించేది లేదని కూడా బండి సంజయ్ హెచ్చరించారు.