uttar pradesh: యూపీలో క‌ల్తీ మ‌ద్యానికి 9 మంది బ‌లి

9 killed in Uttar pradesh
షార్ట్స్‌లో చూడండి
ఎన్నిక‌ల వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. క‌ల్తీ మ‌ద్యం 9 మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 10 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజాంగ‌ఢ్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో క‌ల్తీ మ‌ద్యం తాగిన వారిలో 9 మంది చ‌నిపోయారు. అదే క‌ల్తీ మ‌ద్యం సేవించిన మ‌రో 10 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీల మ‌ధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. సరిగ్గా ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌ల్తీ మ‌ద్యానికి ఏకంగా 9 మంది చ‌నిపోవ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.
Go Back to Shorts
uttar pradesh
azangadh
liquior

More Telugu News