శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం

Invitation for CM Jagan to attend Srisailam Brahmotsavas
షార్ట్స్‌లో చూడండి
మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకలకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని రమణీయంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ఈవో లవన్న ఆహ్వానించారు.

మంత్రి వెల్లంపల్లి, ఆలయ ఈవో లవన్న నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ వర్గాలు సీఎం జగన్ కు జ్ఞాపికను కూడా బహూకరించాయి.
Go Back to Shorts
Srisailam
Brahmotsavas
CM Jagan
Vellampalli Srinivasa Rao
Andhra Pradesh

More Telugu News