తెలంగాణలో కొత్తగా 1,061 మందికి కరోనా పాజిటివ్

Telangana corona bulletin
  • గత 24 గంటల్లో 69,892 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 274 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 21,470 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి సాధారణ స్థితికి చేరుకుంటోంది. గడచిన 24 గంటల్లో 69,892 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 1,061 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 274 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 78, రంగారెడ్డి జిల్లాలో 78 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 3,590 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,79,971 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,54,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,470 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,102కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News