అందుకే అసదుద్దీన్ ఒవైసీపై ఇద్దరు కాల్పుల ఘటనకు పాల్పడ్డారు: యూపీ పోలీసులు
- గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నారు
- ర్యాలీల్లో ఒవైసీ ప్రసంగాలు వారికి నచ్చలేదు
- దీంతో దాడి చేయాలని భావించారు
- దాడి చేసే అవకాశం కోసం ఎదురు చూశారన్న పోలీసులు
సదరు నిందితులు ఒవైసీ నిర్వహించిన మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు కూడా హాజరయ్యారని చెప్పారు. ఆయా ర్యాలీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిజానికి నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నప్పటికీ ఆ సమయంలో దాడి చేసే అవకాశం వారికి రాలేదని తెలిపారు.