తెలంగాణలో జనవరి 24 నుంచి సగం సిబ్బందితో తెరుచుకోనున్న హైస్కూళ్లు
- 8,9,10వ తరగతులకు ఆన్ లైన్ క్లాసులు
- ప్రభుత్వ పాఠశాలల్లో సగం సిబ్బందితో నిర్వహణ
- ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
దీంతో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24 (సోమవారం) నుంచి 8, 9, 10 తరగతులకు ఆన్ లైన్ క్లాసులు చేపట్టేందుకు అనుమతించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రోజువారీ రొటేషన్ విధానంలో హాజరు కావాలంటూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. దీంతో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను తెరిచి ఆన్ లైన్ క్లాస్ లను నిర్వహించనున్నారు.
మరోవైపు జేఎన్టీయూ హైదరాబాద్ ఈ నెల 30 వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించవద్దంటూ తన పరిధిలోని కాలేజీలన్నింటికీ ఆదేశాలు ఇచ్చింది.