ఏపీలో మరో 984 కరోనా కేసులు... తాజా బులెటిన్ విడుదల

AP Corona Latest Bulletin
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 24,280 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు
  • ఇంకా 5,606 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 24,280 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 151, తూర్పు గోదావరి జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,82,843 మంది కరోనా బారినపడగా, 14,505 మంది మరణించారు. 20,62,732 మంది ఆరోగ్యవంతులు కాగా... 5,606 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News