మోదీ కోసం రేపు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు
- బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహణ
- పంజాబ్ ఘటన నేపథ్యంలో హోమాలు
- రేపు ఉదయం 11 గంటల నుంచి నిర్వహణ
- హైదరాబాద్ లో మృత్యుంజయ హోమం చేయనున్న బండి సంజయ్
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ హోమాలు నిర్వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మృత్యుంజయ హోమానికి బండి సంజయ్ హాజరు కానున్నారు. ప్రధానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుతూ ఈ హోమం చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు