వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి
- వైకుంఠద్వార దర్శనం తేదీలు ప్రకటించిన టీటీడీ
- ఈ నెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార దర్శనం
- సిఫారసు లేఖలు తీసుకోబోమన్న వైవీ సుబ్బారెడ్డి
- నందకం, వకుళమాత భవనంలో గదుల కేటాయింపు
వీఐపీలకు నందకం, వకుళమాత వసతి భవనంలో గదులు కేటాయిస్తామని వెల్లడించారు. తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మరమ్మతు పనుల వల్ల గదుల కొరత ఉందని అన్నారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లు గలవారు తిరుపతిలో గదులు తీసుకోవాలని సూచించారు.