రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • 2021కి వీడ్కోలు పలికిన ప్రజానీకం
  • 2022లో అందరికీ మంచి జరగాలన్న సీఎం జగన్
  • నిండు మనస్సుతో కోరుకుంటున్నానంటూ ట్వీట్
గతేడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఆశలతో 2022లోకి అడుగుపెట్టిన సమయాన ఏపీ సీఎం జగన్ విషెస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరిగేలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటున్నానని తెలిపారు.

CM Jagan
New Year
2022
Wishes
Andhra Pradesh

More Telugu News