యాషెస్ రెండో టెస్టు కూడా ఆసీస్ దే... ఇంగ్లండ్ మళ్లీ కుదేలు!
- అడిలైడ్ లో రెండో టెస్టు
- 275 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం
- జై రిచర్డ్సన్ కు 5 వికెట్లు
- 5 టెస్టుల సిరీస్ లో ఆసీస్ 2-0తో ఆధిక్యం
- ఈ నెల 26 నుంచి మూడో టెస్టు
అడిలైడ్ లో జరిగిన ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 9 వికెట్లకు 230 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్నుంచింది. అయితే ఏ దశలోనూ ఇంగ్లండ్ లక్ష్యాన్ని సమీపించేలా కనిపించలేదు. కెప్టెన్ జో రూట్ గాయపడడం ఇంగ్లండ్ శిబిరాన్ని నిరాశకు గురిచేసింది.
ఈ విజయం అనంతరం 5 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ లో జరగనుంది.