'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసినట్టనిపించింది: తిరుమలలో బాలకృష్ణ
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'అఖండ' యూనిట్
- సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందన్న బాలయ్య
- కరోనా సమయంలో టైమ్ సెన్స్ తో సినిమాను విడుదల చేశామని వ్యాఖ్య
శ్రీవారి దర్శనానంతరం ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత మీడియాతో బాలయ్య మాట్లాడుతూ, సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమాను విడుదల చేశామని, ఈ చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. సినిమా కోసం అందరం ఎవరి వంతు కృషి వారు చేశామని... ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టైమ్ సెన్స్ తో సినిమాను విడుదల చేశామని తెలిపారు. ఈ సినిమా విజయం సినీ పరిశ్రమకు ఊపిరిపోసినట్టనిపించిందని అన్నారు.