అమరావతి రైతుల తిరుపతి సభకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
- మొన్న ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
- రేపు మధ్యాహ్నం నుంచి రేణిగుంట సమీపంలో బహిరంగసభ
- అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలను పంపిన అమరావతి జేఏసీ
ఈ సభను నిర్వహించుకోవడానికి ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిపిందే. దీంతో సభకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. అమరావతి మహోద్యమం పేరుతో సభను నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలను పంపామని చెప్పారు. అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేలా సభను నిర్వహిస్తామని తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరగనుంది.