Andhra Pradesh: ఏపీలో మరో 108 మందికి కరోనా పాజిటివ్

AP Corona bulletin
  • గత 24 గంటల్లో 21,010 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు
  • కృష్ణా జిల్లాలో ఒకరి మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,878
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 21,010 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 108 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 141 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,631 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,878 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,467కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News