చూస్తుంటే బీజేపీతో మమత కుమ్మక్కయ్యారని అనిపిస్తోంది: చత్తీస్గఢ్ సీఎం
- మమత పోరాటం ఎవరితో
- అధికార పార్టీతోనా? సహ ప్రతిపక్షంతోనా?
- ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ మూల స్తంభం
- గోవాలో పోటీ వెనక విపక్ష ఓట్లను చీల్చే కుట్ర
ప్రతిపక్షాల కూటమికి కాంగ్రెస్ పార్టీయే మూల స్తంభమని స్పష్టం చేశారు. ఎన్సీపీ నేత శరద్ పవార్తో చర్చలు జరిపిన అనంతరం మమత మాట్లాడుతూ యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించారని గుర్తు చేసిన భూపేష్.. అంతకుముందు ప్రధానితో మాట్లాడిన ఆమె దేని గురించి చర్చించారో మాత్రం చెప్పడం లేదన్నారు. ఈ పరిణామాలను బట్టి బీజేపీ, తృణమూల్ కుమ్మక్కయినట్టు కనిపిస్తోందన్నారు. గోవాలో తృణమూల్కు బలం లేకపోయినా అక్కడ పోటీకి దిగడం వెనక ప్రతిపక్షాల ఓట్లను చీల్చే కుట్ర దాగి ఉందని చత్తీస్గఢ్ సీఎం ఆరోపించారు.