Telangana: తెలంగాణలో మరో 156 మందికి కరోనా పాజిటివ్

Telangana corona bulletin
  • గత 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు
  • కరీంనగర్ జిల్లాలో 47 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,787 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,693 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 147 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,69,157 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,787 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,999కి పెరిగింది.
Telangana
Corona Virus
Bulletin
New Cases

More Telugu News