తుపాను హెచ్చరికలు.. మూడు జిల్లాలకు పర్యవేక్షణ అధికారులను నియమించిన సీఎం జగన్
- అధికారులతో పరిస్థితులపై సమీక్ష
- లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశం
- సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్న సీఎం
తుపాను పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్. అరుణ్ కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, విశాఖ జిల్లాకు శ్యామలారావును పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాల్సిందిగా వారిని సీఎం జగన్ ఆదేశించారు.