ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం
- దక్షిణ కోస్తా, రాయలసీమను అతలాకుతలం చేసిన వర్షాలు
- పలు జిల్లాల్లో వరదలు
- నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందం
- నేడు చిత్తూరు జిల్లాలో పర్యటన
పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులు నిర్ధారించారు. తమ పర్యటనలో భాగంగా వారు భీమా నది పరీవాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. కేంద్ర బృందం వెంట చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ కూడా ఉన్నారు. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన వివరాలను ఆయన కేంద్ర బృందానికి తెలియజేశారు. కేంద్ర బృందం సభ్యులకు రైతులు తమ పొలాల్లో దెబ్బతిన్న వరి, వేరుశనగ పంటను తీసుకువచ్చి చూపించారు.