Vijay Sai Reddy: రాజకీయాల్లో లేని తన భార్యను అవమానించారట: విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు

vijaya sai slams chandra babu
  • వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లాడు చంద్ర‌బాబు
  • ‘స్వీయ ఓదార్పు’ యాత్రగా మార్చాడు
  • నష్టపోయిన రైతుల గురించి మాట్లాడతాడని అనుకున్నాం
  • మళ్లీ అదే పాట పాడుతున్నాడు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌లను చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించిన అంశాన్ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌స్తావించారు.

'వరద ప్రాంతాల సందర్శనను ‘స్వీయ ఓదార్పు’ యాత్రగా మార్చాడు చంద్రబాబు. నష్టపోయిన రైతుల గురించో, బాధితుల గురించో మాట్లాడతాడు అనుకుంటే మళ్లీ అదే పాట పాడుతున్నాడు. రాజకీయాల్లో లేని తన భార్యను అవమానించారట. అసెంబ్లీలో ఎవరూ ఆమె గురించి ప్రస్తావించకపోయినా తన పరువు తనే తీసుకుంటున్నాడు' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News