Telangana: తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు

Telangana corona cases and deaths media bulletin
  • గత 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 50 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,735 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా, 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14 కేసులు గుర్తించారు. అదే సమయంలో 151 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,73,722 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,66,012 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,735 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,975కి పెరిగింది.
Telangana
Corona Virus
Today Cases
Media Bulletin

More Telugu News