Telangana: తెలంగాణ కొవిడ్ రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

Telangana corona media bulletin
  • గత 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు
  • 161 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 50 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,750 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించగా, 161 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు గుర్తించారు. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 174 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,750 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,967కి పెరిగింది.
Telangana
Media Bulletin
Corona Virus
Today Cases

More Telugu News