బండి సంజయ్.. తడి బట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా?: తెలంగాణ మంత్రి గంగుల
- బీజేపీ నేతలు చికెన్లు, గుడ్లు పంపిణీ చేస్తున్నారు
- డబ్బులు పంచామంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు
- ఆరోపణలు నిజమేనని ప్రమాణం చేయాలి
చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి రావాలని బండి సంజయ్ చెప్పారు. తడి బట్టలతో అమ్మవారి గుడిలోకి వచ్చే దమ్ముందా? అని నిలదీశారు. తప్పు చేసిన వారికే శిక్ష పడుతుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించాలని ఆయన అన్నారు.