క్రికెట్ లైవ్ గురు యాప్ ద్వారా జోరుగా బెట్టింగ్ సాగుతోంది: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
- యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్
- వరల్డ్ కప్ మ్యాచ్ లపై బెట్టింగ్
- సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్న సీపీ
- నగదు బహుమతి ఇస్తామని వెల్లడి
హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో బెట్టింగ్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా సీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.14.92 లక్షల నగదు, పలు ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.