తెలంగాణలో కొత్తగా 135 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 26,842 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు
- పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ఒకరి మృతి
వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది.
