ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కొత్త బాదుడు మొదలుపెట్టిన ఫోన్పే
- మొబైల్ రీచార్జ్ రూ. 50 దాటితే ప్రాసెసింగ్ ఫీజు వసూలు
- ఆ లోపు పూర్తిగా ఉచితం
- నిర్ణయం తీసుకోని ఇతర సంస్థలు
50 రూపాయల లోపు చేసే రీచార్జ్లు మాత్రం పూర్తిగా ఉచితమని, ఆపై 100 రూపాయల వరకు రూపాయి, అది దాటితే రూ. 2 వసూలు చేస్తామని ఫోన్పే తెలిపింది. గత నెలలో ఏకంగా 165 కోట్ల యూపీఐ లావాదేవీలు నిర్వహించింది.
కాగా, ఇతర డిజిటల్ చెల్లింపు యాప్లు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఫోన్పేతోపాటు ఇతర యాప్లు కూడా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.