యాదాద్రి గోపురానికి స్వర్ణ తాపడం... కేసీఆర్ పిలుపుతో భారీగా పసిడి విరాళాలు
- ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణం
- విమాన గోపురానికి స్వర్ణతాపడం
- పసిడి విరాళాల కోసం పిలుపునిచ్చిన కేసీఆర్
- విరాళం ప్రకటించిన దానం నాగేందర్, చిన్నపరెడ్డి
- 3 కిలోల బంగారం అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంస్థాన్ ప్రకటన
ఎమ్మెల్యే దానం నాగేందర్ కేజీ బంగారం విరాళంగా ప్రకటించగా... ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శ్రీని ఫార్మా సంస్థతో కలిసి కేజీ బంగారం విరాళంగా అందించనున్నట్టు తెలిపారు. ఇక, ఏపీ, తెలంగాణ బ్రాహ్మణుల తరఫున 3 కిలోల బంగారం అందించనున్నట్టు భారత బ్రాహ్మణ సంస్థాన్, బ్రాహ్మణ సంక్షేమ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్ శర్మ వెల్లడించారు. కొందరు ఇతర దాతలు కూడా యాదాద్రి క్షేత్ర విమాన గోపుర స్వర్ణతాపడానికి తమవంతు విరాళాలు ప్రకటించినట్టు సీఎంవో అధికారులు తెలిపారు.