టీ20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్
- 141 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన బంగ్లాదేశ్
- ఆల్రౌండర్ నైపుణ్యంతో మనసులు దోచుకున్న స్కాట్లాండ్
- బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన క్రిస్ గ్రీవ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
అనంతరం 141 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. షకీబల్ హసన్ 20, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 38, కెప్టెన్ మహ్మదుల్లా 23, అఫీఫ్ హొసైన్ 18 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ వీల్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ గ్రీవ్స్ రెండు, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగులో సత్తా చాటిన క్రిస్ గ్రీవ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్లో నేడు ఐర్లాండ్-నెదర్లాండ్స్, శ్రీలంక-నమీబియా మధ్య గ్రూప్-ఎ మ్యాచ్లు జరుగుతాయి.