Sabarimala: నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

Sabarimala temple to open today
షార్ట్స్‌లో చూడండి
కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో కొలుచుకునే అయ్యప్పస్వామి కొలువుండే శబరిమల ఆలయం ఈరోజు తెరుచుకోనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్వోం బోర్డు ప్రకటించింది. అయితే ఈరోజు కేవలం ఆలయ అర్చకులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

రేపు ఉదయం 5 గంటల నుంచి అక్టోబర్ 21 వరకు భక్తులను అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసి వేస్తారు. మరోవైపు ఆలయం తలుపులు తెరుచుకుంటున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఏలోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
Sabarimala
Temple
Open

More Telugu News