దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ పిచ్చిరెడ్డి కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చిరెడ్డి
- వైద్యుడిగా పదేళ్లపాటు సేవలు
- దర్శి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
ఇందిరాగాంధీ స్ఫూర్తితో 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది దర్శి నుంచి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 1987లో పొదిలి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో దర్శి నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 1996లో జరిగిన ఉప ఎన్నికతోపాటు 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలంపాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన తర్వాత వైసీపీలో చేరారు.