త‌న చావుకు న‌లుగురు కార‌ణ‌మంటూ ఫోనులో రికార్డు చేసి.. డాబా పైనుంచి దూకి మ‌హిళ ఆత్మ‌హత్య‌

woman commits suicide
  • ప‌శ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడ‌లో ఘ‌ట‌న
  • తన కోడ‌లి కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌లు
  • అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు
త‌న చావుకు న‌లుగురు కార‌ణ‌మంటూ ఫోనులో రికార్డు చేసిన ఓ మ‌హిళ‌ డాబా పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప‌శ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మాదివాడ‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు నాగ‌మ‌ణి అని స్థానికులు తెలిపారు.

త‌న కోడ‌లి కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుగుతోన్న గొడ‌వ‌ల కార‌ణంగానే నాగ‌మ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, నాగ‌మ‌ణి మాట్లాడిన ఫోను రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
West Godavari District
Crime News

More Telugu News