Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

India reports 18166 new COVID cases
  • కొత్తగా 18,166 క‌రోనా కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య  3,39,53,475
  • నిన్న‌ 214 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,50,589 
దేశంలో కొత్త క‌రోనా కేసులు మ‌రోసారి 20 వేల‌కు దిగువ‌న న‌మోద‌య్యాయి. నిన్న‌ 18,166 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య  3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 23,624 మంది కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,589కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,71,915కు పెరిగింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,30,971 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 94,70,10,175 వ్యాక్సిన్ల డోసులు వినియోగించారు.


Corona Virus
COVID19
India

More Telugu News