కారులోగానీ, కాన్వాయ్ లోగానీ నేను లేను.. ఇవిగోండి సాక్ష్యాలు.. పోలీసుల విచారణలో కేంద్ర మంత్రి కుమారుడు
- ఇవాళ విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా
- లఖింపూర్ ఖేరి ఘటనపై వివరణ
- తాను దంగల్ లో ఉన్నానని వెల్లడి
- సాక్ష్యంగా వీడియో, పది మంది వాంగ్మూలాలు
వాస్తవానికి శుక్రవారం ఉదయమే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. అయితే, అనారోగ్యం కారణంగా రాలేకపోయారని అజయ్ మిశ్రా వివరణ ఇచ్చారు. దీంతో అధికారులు తాజా సమన్లు ఇవ్వడంతో ఆయన విచారణకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.