చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం.. వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం.. బాలికపైనా అఘాయిత్యానికి యత్నం

  • 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం
  • బాలిక కేకలు వేయడంతో పరార్
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడిన 16 ఏళ్ల బాలుడు, ఆమె మనవరాలిపైనా అత్యాచారానికి యత్నించాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో బాధిత వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె బంధువులు కాస్తంత దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం మంచంపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గమనించిన అదే కాలనీకి చెందిన బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ తర్వాత గంటకు బాధితురాలి ఆరేళ్ల మనవరాలు భోజనం తీసుకుని రాగా, నిందితుడు ఆమెపైనా అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. నిన్న ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు, ఆమె మనవరాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Chittoor District
Palamaner
Boy
Eleder Woman
Rape

More Telugu News