ఉపఎన్నిక తర్వాత హింస జరగకుండా చూడండి: బెంగాల్ ప్రభుత్వానికి ఈసీ సూచన

  • భవానీపూర్‌లో ఘనవిజయం సాధించిన తృణమూల్
  • మమతకు బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58 వేల ఓట్లపైగా ఆధిక్యం
  • ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఈసీ ఆందోళన
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. భవానీపూర్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ కోరింది. గత ఎన్నికల్లో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) భారీ విజయం తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ అధినేత్రి ఘనవిజయం తర్వాత అలాంటి పరిస్థితులే తలెత్తే ప్రమాదముందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. కాగా, భవానీ పూర్‌ ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ప్రియాంకపై 58 వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.

West Bengal
by-poll
violence

More Telugu News