Bandi Sanjay: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బండి సంజ‌య్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

bandi sanjay slams trs
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్‌కు బండి సంజ‌య్‌ వ‌రుస‌గా లేఖ‌లు రాస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఆయ‌న లేఖ రాస్తూ 'కేసీఆర్ సారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?' అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై అనేక ప్ర‌శ్న‌లు సంధించారు. బాధ్య‌త గ‌ల పార్టీగా ప్ర‌జ‌ల ప‌క్షాన బీజేపీ త‌ర‌ఫున రేపు మ‌రిన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాన‌ని ఆయ‌న చెప్పారు.

          
Go Back to Shorts
Bandi Sanjay
BJP
KCR

More Telugu News