స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష
- అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు
- గంజాయి సాగును అరికట్టాలని స్పష్టీకరణ
- ఎస్ఈబీ కాల్ సెంటరు నెంబరుపై ప్రచారం చేయాలని సూచన
- విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలని వెల్లడి
ఎస్ఈబీ కాల్ సెంటర్ నెంబరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై కాలేజీలు, వర్సిటీల్లో చైతన్యం కలిగించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపి అరికట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. గుట్కా విక్రయాలు, రవాణాపై మరింత దృష్టి సారించాలని నిర్దేశించారు.