Narendra Modi: ‘మోదీ ఇచ్చారనుకున్నా’.. ఖాతాలో పడిన 5.5 లక్షలు ఖర్చుపెట్టేసిన వ్యక్తి!

man refuses to return wrongfully credited funds
షార్ట్స్‌లో చూడండి
బ్యాంకు అధికారుల పొరపాటుతో ఒక వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. దీన్ని గుర్తించిన అధికారులు సదరు వ్యక్తికి ఫోన్ చేసి ఆ డబ్బును తిరిగిచ్చేయాలని అడిగారు. అయితే ఆ సొమ్మును ప్రధాని మోదీ నుంచి వచ్చిందనుకొని ఖర్చు పెట్టేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ప్రస్తుతం తన ఖాతాలో డబ్బు లేదని, ఆ సొమ్ము తిరిగివ్వలేనని తేల్చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్‌లోని ఖగారియా ప్రాంతంలో జరిగింది.

స్థానికంగా ఉన్న గ్రామీణ బ్యాంకులో జరిగిన చిన్న పొరపాటుతో.. ఈ ఏడాది మార్చి నెలలో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఖాతాలో రూ.5.5 లక్షల రూపాయలు జమయ్యాయి. తర్వాత తీరిగ్గా తమ పొరపాటును గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ సొమ్మును తిరిగిచ్చేయాలని రంజిత్‌ను అడిగారు.

‘‘ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తారని వార్తలొచ్చాయి. నా ఖాతాలో పడిన డబ్బు దానిలో మొదటి విడత ఇన్‌స్టాల్‌మెంట్ అనుకున్నా. ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు’’ అని రంజిత్ చెప్పాడు. బ్యాంకు మేనేజర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Bank
Bihar

More Telugu News