Andhra Pradesh: ఏపీ రోజువారీ కొవిడ్ కేసుల బులెటిన్ ఇదిగో!

AP Covid details bulletin
  • గత 24 గంటల్లో 49,568 కరోనా పరీక్షలు
  • 1,125 మందికి కరోనా పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 210 కేసులు
  • కర్నూలు జిల్లాలో ఒక కేసు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
ఏపీలో కరోనా వ్యాప్తికి సంబంధించి రోజువారీ కేసులు, మరణాలు, ఇతర వివరాల బులెటిన్ ను ఆరోగ్య శాఖ కొద్దిసేపటి కిందట వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 49,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,125 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 210 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 184, కృష్ణా జిల్లాలో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 161, ప్రకాశం జిల్లాలో 110 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.

అదే సమయంలో 1,356 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,019కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,31,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,03,543 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,412 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
Bulletin
Daily Cases
Today Cases
Deaths

More Telugu News