టీమిండియా సహాయకబృందంలో మరొకరికి కరోనా... క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు

One more person tested corona positive in Team India
  • ఇటీవల రవిశాస్త్రి సహా ముగ్గురికి కరోనా
  • తాజాగా మరోసారి కరోనా కలకలం
  • ఆటగాళ్లకు కరోనా పరీక్షలు
  • రేపటి నుంచి ఇంగ్లండ్ తో ఐదో టెస్టు
ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే టీమిండియా సహాయక బృందంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.

ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్ తో ప్రారంభయ్యే చివరిదైన ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. తాజా కరోనా కలకలం నేపథ్యంలో టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Team India
Corona Virus
Coaching Staff
England

More Telugu News