రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ
- కరోనా వల్ల ఏప్రిల్ లో టోకెన్ల జారీ నిలిపివేత
- తాజాగా పునరుద్ధరణ
- ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం
- రోజుకు 2 వేల టోకెన్లు
తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో ఈ టోకెన్లు ఇస్తామని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ వర్గాలు నిలిపివేశాయి. కరోనా కేసులు తగ్గుతుండడంతో పునరుద్ధరించారు.