గత 19 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ రాజధానిలో వర్ష బీభత్సం
- ఒక్కరోజు వ్యవధిలో 100 మిమీ పైగా వర్షం
- ఇంకా వర్షాలు పడతాయన్న ఐఎండీ
- ఇప్పటికే నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
- చెరువుల్లా మారిన రహదారులు
ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నివాసాల్లోకి, షాపింగ్ మాల్స్ లోకి నీరు ప్రవేశించింది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.