మర్యాదగా లొంగిపోండి... లేకపోతే చంపేస్తాం: తాలిబన్ల లేఖలు
- అమెరికాకు సహకరించిన ప్రతి ఒక్కరూ లొంగిపోవాలంటూ లేఖలు
- బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు లేఖలు అంటించిన తాలిబన్లు
- లొంగిపోని వారికి మరణశిక్షను విధిస్తామని హెచ్చరిక
బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు ఈ లేఖలు అంటించారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు మద్దతు ఇచ్చిన వారు వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని... లేకపోతే మరణశిక్షను అమలు చేస్తామని లేఖలో తాలిబన్లు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఓ వ్యక్తి మాట్లాడుతూ, హెల్మాండ్ ప్రావిన్స్ లో బ్రిటన్ ఆర్మీ రోడ్లను నిర్మించిందని... ఈ సమయంలో తమ ప్రాంత అభివృద్ధి కోసం తాను సహాయం చేశానని తెలిపాడు. అయితే, తాను ఆ విషయాలను బయటకు చెప్పదలుచుకోలేదని... బయట కూడా ఇకపై పెద్దగా కనిపించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తనకు బతకాలని ఉందని అన్నాడు.