బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పక్క భవనంలోకి దూసుకెళ్లిన 'ఆడి' కారు.. ఏడుగురి దుర్మరణం

7 killed in car crash in Koramangala
  • కోరమంగళలో ఘటన
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
  • నుజ్జు అయిన ఆడి క్యూ3 కారు
బెంగళూరులోని కోరమంగళలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆడి క్యూ3 కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జు అయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు కష్టపడాల్సి వచ్చింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Bengaluru
Koramangala
Karnataka
Road Accident

More Telugu News