Telangana: తెలంగాణలో గత 24 గంటల్లో 366 కొత్త కేసుల నమోదు

Telangana daily corona positive cases and deaths
  • రాష్ట్రంలో 80,470 కరోనా పరీక్షలు
  • ఒక్క జీహెచ్ఎంసీలోనే 100కి పైగా కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,295 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,470 కరోనా పరీక్షలు నిర్వహించగా, 366 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 102 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 34, వరంగల్ అర్బన్ జిల్లాలో 27, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులను గుర్తించారు.

అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,098 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,45,939 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,295 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,864కి పెరిగింది.
Telangana
New Cases
Deaths
COVID19

More Telugu News