Corona Virus: ఏపీలో మరో 1,248 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Positive cases and deaths media report
  • గత 24 గంటల్లో 58,890 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరిలో 238 కేసులు
  • కడప జిల్లాలో 19 కేసులు
  • తాజాగా 15 మరణాలు
  • ఇంకా 13,677 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 58,890 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,248 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 238 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 166, కృష్ణా జిల్లాలో 148, గుంటూరు జిల్లాలో 130, నెల్లూరు జిల్లాలో 120, ప్రకాశం జిల్లాలో 118 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 19 కేసులను గుర్తించారు.

అదే సమయంలో 1,715 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మరణాలు సంభవించాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,04,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,77,163 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 13,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,750కి పెరిగింది.
Corona Virus
New Cases
Deaths
Andhra Pradesh

More Telugu News