భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ సంచారం
- ఈ తెల్లవారుజామున కనిపించిన డ్రోన్
- ఆర్నియా సెక్టార్లో సంచారం
- 25 రౌండ్లు కాల్పులు జరిపిన జవాన్లు
- మరింత ఎత్తుకు చేరి పాక్ వైపు వెళ్లిన డ్రోన్
తాజాగా ఈ తెల్లవారుజామున జమ్మూలోని ఆర్నియా సెక్టార్ లో ఓ డ్రోన్ కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ వస్తున్న డ్రోన్ ను భారత సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. వెంటనే పాతిక రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ నిష్క్రమించింది. తుపాకుల రేంజికి అందకుండా మరింత ఎత్తుకు చేరిన ఆ డ్రోన్, పాక్ భూభాగం వైపు వెళ్లిపోయింది. ఆపై బీఎస్ఎఫ్ జవాన్లు స్థానిక పోలీసులతో కలిసి ఆర్నియా సెక్టార్లో గాలింపు చేపట్టగా, ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు.