భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ సంచారం

Once again drone spotted at Indo Pakistan border
  • ఈ తెల్లవారుజామున కనిపించిన డ్రోన్
  • ఆర్నియా సెక్టార్లో సంచారం
  • 25 రౌండ్లు కాల్పులు జరిపిన జవాన్లు
  • మరింత ఎత్తుకు చేరి పాక్ వైపు వెళ్లిన డ్రోన్
ఇటీవల భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ, శ్రీనగర్ లోనూ డ్రోన్లు తీవ్ర కలకలం రేపాయి. వాటిలో ఓ డ్రోన్ పేలుడు పదార్థాలు మోసుకురావడం ఆందోళన కలిగించింది. గత రెండేళ్ల కాలంలో సరిహద్దుల్లో 350కి పైగా డ్రోన్లను గుర్తించారు. అయితే, వీటి పట్ల భారత భద్రతా బలగాలు అప్రమత్తంగానే ఉన్నాయి.

తాజాగా ఈ తెల్లవారుజామున జమ్మూలోని ఆర్నియా సెక్టార్ లో ఓ డ్రోన్ కనిపించింది. ఆకాశంలో మెరుస్తూ వస్తున్న డ్రోన్ ను భారత సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. వెంటనే పాతిక రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ నిష్క్రమించింది. తుపాకుల రేంజికి అందకుండా మరింత ఎత్తుకు చేరిన ఆ డ్రోన్, పాక్ భూభాగం వైపు వెళ్లిపోయింది. ఆపై బీఎస్ఎఫ్ జవాన్లు స్థానిక పోలీసులతో కలిసి ఆర్నియా సెక్టార్లో గాలింపు చేపట్టగా, ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు.
Go Back to Shorts
Drone
Jammu And Kashmir
Arniya
India
Pakistan

More Telugu News