Telangana: తెలంగాణలో 400కి దిగువన రోజువారీ కరోనా కేసులు

Telangana covid cases and deaths daily update
  • గత 24 గంటల్లో 73,899 కరోనా పరీక్షలు
  • 359 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 74 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,728 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 73,899 కరోనా పరీక్షలు నిర్వహించగా, 359 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 74 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది.
Telangana
Corona Virus
COVID19
New Cases
Deaths

More Telugu News